కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని ఇప్పుడు భయపెడుతుంది.ఇప్పటికే దేశంలో లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవగా ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.
అయితే డెత్ రేట్ తక్కువగానే ఉన్న అంటువ్యాధి కావడంతో ప్రతి ఒక్కరు భయాందోళనకి గురవుతున్నారు.తమిళనాడులో అయితే విపరీతంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి.
ఇండియాలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.ఇక సెలబ్రెటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు.
ఇప్పటికే అమితాబచ్చన్ ఫామిలీ కరోనా బారిన పడ్డారు.తాజగా సౌత్ హీరోలకి కూడా కరోనా భయం పట్టుకుంది.
సౌత్ స్టార్ హీరో విశాల్ కరోనా బారిన పడ్డట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.విశాల్ తో పాటు ఆయన తండ్రి, మేనేజర్ కి కూడా కరోనా సోకింది.
ప్రస్తుతం వీరంతా ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటున్నారు.
ఈ విషయంపై స్వయంగా విశాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
నాతో పాటు మా నాన్నకు కరోనా సోకిందన్న విశాల్ తీవ్ర జ్వరంతో, జలుబు, దగ్గుతో బాదపడ్డానని వారం రోజుల పాటు ఆయుర్వేద మెడిసిన్ వాడడంతో ప్రస్తుతం ఆరోగ్య నిలకడగా ఉందన్నారు.ఇక ప్రస్తుతం విశాల్ చక్ర, డిటెక్టివ్2 సినిమాలలో నటిస్తున్నారు.
ఇలా కరోనా బారిన పడటంతో ఆగష్టులో తన కొత్త సినిమా షూటింగ్ కి వెళ్దామని అనుకున్న విశాల్ మళ్ళీ పునరాలోచనలో పడ్డారు.సౌత్ హీరోలని కూడా కరోనా భయపెట్టడంతో షూటింగ్ లు చేయాలని అనుకున్న అందరూ నిర్ణయంపై మరోసారి ఆలోచిస్తున్నారు.
ఇక తెలుగులో కరోనా బారిన పడ్డ సీరియల్ నటి నవ్యా స్వామి కరోనా నుంచి బయటపడినట్లు తాజాగా తెలియజేసింది.