కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికీ ఆయన మరణ వార్త నుంచి ఇటు సినీ ప్రేమికులు కుటుంబసభ్యులు బయటపడలేక పోతున్నారు.
ఇక పోతే పునీత్ మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేమికులు ఆయన కడసారి చూపు కోసం వేల సంఖ్యలో బెంగుళూరుకి చేరుకొని నటుడు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు.
ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది సినీ తారలు బెంగళూరుకు వెళ్లి పునీత్ చివరి చూపులుచూడటమే కాకుండా ఆయన అంత్యక్రియలలో కూడా పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే తమిళనాడు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు ఆయన మృతిపై స్పందించకపోవడంతో కన్నడ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా ఆయన మరణించిన తర్వాత ఇప్పుడిప్పుడే కొందరు తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరోలు పునీత్ సమాధిని దర్శించుకుని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి బెంగళూరుకు వెళ్లి పునీత్ సమాధిని దర్శించి ఆయనకు నివాళులు అర్పించారు.ఈ క్రమంలోని కన్నడ సినీ ప్రేమికులు అభిమానులు పెద్ద ఎత్తున హీరో విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.పునీత్ గత ఏడాది మరణిస్తే మీకు ఇప్పుడు తీరిక దొరికిందా అంటూ కొందరు ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరైతే ఆయన ప్రత్యేకించి పునీత్ కి నివాళులు అర్పించడానికి రాలేదని ఏదో పని నిమిత్తం బెంగుళూరు వచ్చి పనిలో పనిగా పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పిస్తున్నారంటూ దారుణంగా విజయ్ గురించి ట్రోల్ చేస్తున్నారు.