‘శ్రీమంతుడు’ సినిమాతో సూపర్ స్టార్ మహేష్బాబు నిర్మాతగా మారిన విషయం తెల్సిందే.మొదటి సినిమా విడుదల కాకుండానే రెండవ సినిమా ‘బ్రహ్మోత్సవం’లో కూడా నిర్మాణ భాగస్వామి అయ్యాడు మహేష్బాబు.
ఇక పవన్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.రామ్ చరణ్ తన తల్లి పేరుపై తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సినిమాను నిర్మించబోతున్నాడు.
ఇక హీరోలు నిర్మాతల జాబితాలో మంచు విష్ణు, కళ్యాణ్ రామ్, నితిన్ ఇంకా పలువురు హీరోలు ఉన్నారు.ఈ జాబితాలోని వెంకటేష్ కూడా చేరబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే వెంకటేష్కు హోం బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ ఉంది.అయినా కూడా తన పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయాలని వెంకీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అందుకోసం గత కొంత కాలంగా అండర్ గ్రౌండ్స్లో వర్క్ చేయడం జరిగింది.తన బ్యానర్లో రాబోతున్న మొదటి సినిమాలో తానే హీరోగా నటించబోతున్నాడు.
ఆ సినిమా కథను కూడా ఫైనల్ చేయడం జరిగింది.జూన్ 6వ తేదీన రామానాయుడు జయంతి సందర్బంగా ఆ సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉన్నట్లుండి వెంకీ సురేష్ ప్రొడక్షన్స్ను వదిలి ఎందుకు సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు, అది కాకుండా రామానాయుడు మరణించి సంవత్సరం కూడా కాకుండానే సురేష్ ప్రొడక్షన్స్ను వెంకీ ఎందుకు వదులుకున్నాడు అనేది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పెద్దల్లో చర్చ జరుగుతోంది.