గత కొద్ది కాలంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మత్తు మందు పదార్థాల వినియోగం మరియు సరఫరా కేసు కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో తనీష్, స్పెషల్ సాంగ్ బ్యూటీ ముమైత్ ఖాన్, ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్, వెటరన్ హీరో తరుణ్ మరియు ఇతరులు మత్తు మందు పదార్థాలను వినియోగించినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
దీంతో ఇటీవలే ఈ విషయంపై స్పందిస్తూ హీరో తనీష్ మరియు ముమైత్ ఖాన్ తదితరులు ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన విచారణలో పాల్గొన్నారు.కాగా తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు తరుణ్ కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు.
అంతేకాకుండా తాము మత్తుమందు పదార్థాలను వినియోగించినట్లు వినిపిస్తున్న ఆరోపణలు అవాస్తవమని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఇందులో భాగంగా ఈ విషయానికి సంబంధించి తమ తల వెంట్రుకలు మరియు గోళ్ళు కూడా లేబరోటరీ కి పంపి పరీక్షించాలని కోరారు.
దీంతో ఇటీవలే ఈ శాంపిల్స్ ని పరిశీలించిన ప్రభుత్వ అధికారులు దర్శకుడు పూరి జగన్నాధ్ మరియు హీరో తరుణ్ ఇచ్చిన శాంపిల్స్ లో మత్తు మందు పదార్థాలను వినియోగించినట్లు ఆనవాళ్ళు దొరకలేదని స్పష్టం చేశారు.అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో కూడా సమర్పించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో డ్రగ్స్ వ్యవహారంలో తరుణ్ మరియు పూరి జగన్నాథ్ లపై వినిపిస్తున్న ఆరోపణలకు ఫుల్ స్టాప్ పడింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారానికి తెరలేపిన ప్రముఖ నిందితుడు “కెల్విన్” పై మాత్రం పోలీసులు చర్యలు తీసుకుంటూ మరింత క్షుణ్ణంగా ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని విచారిస్తున్నారు.
ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలను కూడా విచారణకు పిలిపించి విచారిస్తున్నారు.