డెంగీ జ్వరం బారిన పడిన బాలీవుడ్ స్టార్ హీరో

ఇటీవల డెంగీ జ్వరాలు జనాలను ఎంతగా వణికిస్తున్నాయో తెలిసిందే.ఈ డెంగీ బారిన పడి చాలా మంది మృత్యువాత పడ్డారు కూడా.

 Hero Sushant Rajput Suffering For Dengue Fever-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ డెంగీ జ్వరం ఒక సెలబ్రిటీ కి రావడం తో అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాలలో నటించి మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

అతడు చేసిన వాటిలో ధోనీ చిత్రం ఎంతగానో అతడికి గుర్తింపు తీసుకువచ్చింది.ఇటీవల యూరప్ పర్యటన ముగించుకొని ఇండియా కు తిరిగి వచ్చిన రాజ్ పుత్ అనారోగ్యం బారిన పడ్డారు.

దీనితో ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించగా అన్నీ పరీక్షలు నిర్వహించి డెంగీ ఉన్నట్లు తేల్చారు.దీనితో ఈ విషయం కాస్త బయటకు పొక్కడం తో అభిమానులు అందరూ కూడా ఇప్పుడు సుశాంత్ ఆరోగ్యం పై ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ డెంగీ జ్వరం ప్రజలలో బాగా సోకి చాలా ఇబ్బందులు ఎదురుకొంటున్న విషయం విదితమే.అయితే ఇప్పుడు ఈ జ్వరం సెలెబ్రిటీ కి కూడా రావడం తో అందరూ ఆందోళన పడుతున్నారు.

ఇప్పటికే డెంగీ జ్వరం కారణంగా సుశాంత్ తన షూటింగ్స్ అన్నింటీని కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.

Telugu Bollywood, Sushantrajput, Sushantdhoni, Sushant Rajput-Movie

అంతేకాకుండా అబుదాబి పర్యటనకు వెళ్లాల్సి ఉండగా దానిని కూడా వాయిదా వేసుకున్నట్లు సమాచారం.అన్నిటిని రద్దు చేసుకొని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు సుశాంత్.త్వరగా సుశాంత్ కు ఈ జ్వరం తగ్గిపోయి క్షేమంగా బయటపడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube