దర్శక దిగ్గజం మణిరత్నం ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే కరోనా లాక్డౌన్ కారణంగా సినిమాలు రిలీజ్ లేకపోవడంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా మొదలైంది.
ఈ నేపథ్యంలో చాలామంది నటులు, దర్శకులు వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు.ప్రస్తుతం ఉన్న ఖాళీ సమయంలో వెబ్ సిరీస్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా దర్శక దిగ్గజం మణిశర్మ కూడా తన సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా వెబ్ సిరీస్ లు తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.దాని కోసం ఇప్పటికే అద్భుతమైన కథలని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
మణిరత్నం నిర్మించబోయే ఈ వెబ్ సిరీస్ లో 11 ఎపిసోడ్ లు ఉంటాయని ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కొక్కరు దర్శకుడు ఉంటారని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ లో ఒక దాని కోసం హీరో సూర్యని సంప్రదించినట్లు సమాచారం.
ఇక సూర్య కూడా కొంత టైం చేసుకుని వెబ్ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.త్వరలో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఎపిసోడ్లు పట్టాలు ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు.
మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంతవరకు ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు.