తమిళంలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సూర్య.కెరియర్ లో కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు కూడా చేస్తూ సూర్య తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువ అయ్యాడు.
ప్రస్తుతం సూర్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచేఎన్జీకే అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమాలో సూర్యకి జోడీ గా మన క్రేజీ బ్యూటీ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి నటిస్తుంది.
ఇదిలా వుంటే ఈ సినిమా తర్వాత సూర్య ఇద్దరు లేడీ దర్శకులతో వర్క్ చేయడానికి రెడీ అయ్యారు.అందులో నేషనల్ అవార్డు విన్నర్ గురు డైరెక్టర్ సుధ కొంగరతో ఒకటి కాగా మరో సినిమా తాజాగా పీరియడ్స్, ఎండ్ అఫ్ సెంటెన్స్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం తో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న దర్శకురాలు గునీత్ మోంగ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కే అవకాశం వుందని తెలుస్తుంది.