రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమాలో కూడా విలన్ అత్యంత పవర్ ఫుల్గా ఉంటాడు.హీరోలకు కాస్త అటు ఇటుగా దిట్టంగా ఉండటంతో పాటు, చాలా పవర్ ఫుల్గా ఉంటాడు.
హీరోయిజంను చూపించాలి అంటే విలన్ ఫవర్ ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అంటూ నమ్మే దర్శకుడు రాజమౌళి.అందుకే తన ప్రతి సినిమాలో కూడా హీరోతో పాటు విలన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు.
బాహుబలి చిత్రంలో విలన్ పాత్రకు హీరో రానాను దించి ఆయన క్రేజ్ను అమాంతం పెంచేసిన విషయం తెల్సిందే.ఇక ప్రస్తుతం జక్కన్న మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్నాడు.
ఎన్టీఆర్, చరణ్ లు కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ మూవీ ఇటీవలే పట్టాలెక్కింది.మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది.ఈ షెడ్యూల్లో హీరోలతో భారీ యాక్షన్ సీన్స్ను చిత్రీకరించడం జరిగింది.రెండవ షెడ్యూల్ సమయానికి విలన్ పాత్రను సెట్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడు.విలన్గా ఎంతో మంది పేర్లు వినిపించాయి.హీరో రాజశేఖర్ పేరు కూడా ఎక్కువగానే వినిపించింది.
ఆ తర్వాత యష్ పేరును ప్రస్థావనకు తీసుకు వచ్చారు.అయితే వారెవ్వరు కాదని తమిళ స్టార్ హీరో సూర్యను విలన్ పాత్రకు రంగంలోకి దించినట్లుగా సమాచారం అందుతోంది.
అందుకోసం సూర్యతో చర్చలు జరుపుతున్నాడు.
సూర్య హీరోగా తమిళనాట స్టార్ స్టేటస్ను కలిగి ఉన్నాడు.అంతటి స్టార్ హీరో తెలుగులో కూడా మంచి ఇమేజ్ను కలిగి ఉన్నాడు.అందుకే ఈ మల్టీస్టారర్కు రెండు భాషల్లో క్రేజ్ను తీసుకు వచ్చేందుకు సూర్యను నటింపజేయాలని దర్శకుడు రాజమౌళి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ మల్టీస్టారర్ లో సూర్య విలన్ అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్లాయి.మరి ఈ వార్తపై దర్శకుడు రాజమౌళి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.