తమిళ హీరోలతో సినిమాలు చేయడం కోసం తెలుగు దర్శకులు క్యూ కడుతున్నారు.అలాగే తెలుగు హీరోలతో సినిమాల కోసం తమిళ దర్శకులు క్యూ కడుతున్నారు.
కోలీవుడ్ నుంచి మోహన్ రాజా, లింగుస్వామి, శంకర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు.అలాగే టాలీవుడ్ నుంచి వంశీ పైడిపల్లి, శేఖర్ కమ్ముల ఇప్పటికే కోలీవుడ్ ఎంట్రీ ఖరారు చేసుకున్నారు.
ఇప్పుడు వీరి దారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరిపోయారు.ప్రస్తుతం త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయడానికి రెడీ అయ్యాడు.
సర్కారు వారి పాట తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.అయితే దానికోసం ఎంత కాలం వెయిట్ చేయాలనే విషయంలో సినీ ప్రేక్షకులకి క్లారిటీ లేకపోయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి క్లారిటీ ఉంది.
ఈ నేపధ్యంలో మహేష్ సినిమా కంటే ముందుగా మరో హీరోగా సినిమా చేయాలని ఆయన భావిస్తున్నారు.
అయితే ముందుగా ఓ మీడియం రేంజ్ హీరోతో తక్కువ సమయంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని అనుకున్న ఇప్పుడు అతని నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది.కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెప్పి ఒప్పించారని టాక్.తనకి టాలీవుడ్ లో దర్శకుడుతో త్రివిక్రమ్ తో గొప్ప ఎంట్రీ దొరికే అవకాశం లేదని సూర్య కూడా భావించి వెంటనే ఒకే చెప్పడం జరిగిందని సమాచారం.ప్రస్తుతం ఈ కాంబినేషన్ గురించి ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో హాట్ చర్చ నడుస్తుంది.
త్వరలో ఈ మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ చూస్తున్నట్లు బోగట్టా.