సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ (ఆకాశమే నీ హద్దురా) చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే.కరోనా సమయంలో ఈ సినిమా థియేటర్లో కాకుండా డిజిటల్ మీడియాలో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది.
ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డ్ రేస్ లో నిలబడిందంటేనే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలిసిపోతుంది.ఈ సినిమాలోని ఎన్నో ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా ఈ సినిమాలో సినిమాలోని ‘కయ్యిలే ఆగాశమ్.కొండు వంద ఉన్ పాసమ్’ తెలుగులో “అందని ఆకాశం.దించవయ్యా మా కోసం” అనే పాట ఎంతో మంది హృదయాలను ఆకట్టుకుని అందరి చేత కంటతడి పెట్టించింది.
తాజాగా ఈ పాట పై బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ ఈ పాట చూసినప్పుడు తన కళ్ళ నుంచి కన్నీరు వచ్చాయని తన కన్నీటిని కంట్రోల్ చేసుకోలేక పోయానని ఈ సినిమాపై ప్రశంశల వర్షం కురిపించారు.
సూర్య నటించిన ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్ సీన్స్ ఉన్నాయని, ముఖ్యంగా సహజత్వానికి దగ్గరగా ఉన్న ఈ పాట ఓ తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాన్ని తెలియజేస్తూ ఆవిష్కరించిన పాట ఇది.ఈ ఎమోషన్స్ నాతో చాలా కాలం పాటు ఉండిపోతాయంటూ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై సూర్య స్పందిస్తూ ఈ విధమైనటువంటి ప్రశంసలు, అద్భుతమైన మాటలు ఆ సినిమాకు పెద్ద రివార్డులు.
తన మాటలు మనసుని తాకాయంటూ సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.