సౌత్ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన సినిమా ఎన్జీకె.సాయిపల్లవి రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రిలీజ్ కు ముందు భారీ అంచనాలు నమోదు చేసుకున్న ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
దీంతో ఊహించిన విధంగా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా సూర్య కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారిపోయింది.తమిళంలో ఓ మోస్తారు కలెక్షన్స్ తో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం పూర్తిగా తేలిపోయిందని చెప్పాలి.
ఎన్జీకె మూవీ మూడు రోజుల్లో కనీసం కోటి రూపాయలు కూడా వసూలు చేయలేదంటే ఈ సినిమా టాక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని బడా నిర్మాత రాధాకృష్ణ ఏకంగా 9 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు నిర్మాతకి సినిమా నుంచి భారీ నష్టాలు తప్పవని టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం.ఇక తమిళంలో కూడా ఈ సినిమా కలెక్షన్స్ వర్క్ ఓకే అనిపించుకున్నా సూర్య కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.