టాలీవుడ్ లో అతి చిన్న వయసులో నంది అవార్డు అందుకుంటున్న నటుడు స్వర్గీయ ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటాడు.ఉదయ్ కిరణ్ నటించినటువంటి చిత్రాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు.
హీరోగా ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను, మనసంతా, శ్రీరామ్, ఔనన్నా కాదన్నా వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకి ఇప్పటికీ తమ ఫేవరెట్ చిత్రాల లిస్టు లో ఉంటాయి.అయితే అనుకోకుండా 2004వ సంవత్సరంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం టాలీవుడ్ సినీ పరిశ్రమను కుదిపేసింది.
అయితే తాజాగా ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్ హీరో ఉదయ్ కిరణ్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.ఇందులో భాగంగా తాను, ఉదయ్ కిరణ్ఇద్దరు సినిమాల్లో నటించేటప్పుడు ఎంతో సన్నిహితంగా మెలిగే వాళ్ళమని అంతేగాక నువ్వు నేను చిత్రంలో ఉదయ్ కిరణ్ నిజమైన రేసర్లతో పోటీపడి గెలిచాడని కూడా చెప్పుకొచ్చాడు.
అయితే షూటింగ్ తర్వాత ఆవిషయం గురించి అడగ్గా చిన్నప్పుడు తాను బస్సులు వెంబడి పరిగెత్తే వాడినని ఆ అనుభవం ఇలా ఇప్పుడు పనికి వచ్చిందని సరదాగా చెప్పు వచ్చాడట.కానీ అనుకోని విధంగా ఉదయ్ కిరణ్ అలా ఆత్మహత్య చేసుకోవడం తనని తీవ్రంగా కలచి వేసిందని, టాలీవుడ్ లో అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ఓ వ్యక్తి ఇలా చేసుకోవడం జీర్ణించుకోలేకపోయానని అన్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సునీల్ కలర్ ఫోటో అనే చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.అంతేగాక బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న టువంటి ఈ చిత్రంలో కూడా సునీల్ విలన్ గా నటించే అవకాశం దక్కించుకున్నాడు.ఈ చిత్రంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు.