గురు పవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’.జి మహేష్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించినటువంటి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా అనుభవాలను పంచుకున్నారు.ఈ సినిమా కథ విషయానికి వస్తే అనుకోకుండా కలిసి నలుగురు బైక్ రైడర్స్ వారి జర్నీలో ఏ విధమైనటువంటి సవాళ్లను అధిగమించారు? వాటిని దాటుకుంటూ వారు అనుకున్న గమ్యానికి ఎలా చేరుకున్నారు అనేది అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలియజేశారు.
ఇందులో శ్రీకాంత్ మహేంద్ర అనే పాత్రలో నటించానని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇందులో శ్రీకాంత్ 24 సంవత్సరాల క్రితం తప్పిపోయిన అమ్మాయి కోసం వెతుకుతూ లడక్ వెళ్తారు.
అయితే అంత దూరం బైక్ పైనే వెళ్లాల్సి ఉంది.అలా బైక్ లో వెళ్ళడానికి గల కారణం ఏంటి అనే విషయం ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుందని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలియజేశారు.
ఈ సందర్భంగానే శ్రీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో షూటింగ్ కోసం చెన్నై నుంచి బైక్ పై జర్నీ చేస్తూ హైదరాబాద్ వచ్చేవాడిని తెలియజేశారు.
ఇలా కెరీర్ ప్రారంభంలో బైక్ జర్నీ చేస్తూ మంచి షూటింగులకు హాజరయి ఎన్నో సినిమాలలోనటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం ఇదే మా కథ చిత్రంలో మహేంద్ర అనే కీలక పాత్రలో నటిస్తున్నారని, ఈ సినిమా రెండో తేదీ విడుదల కాబోతోందని,ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలియజేశారు.ఇక సాయిధరమ్ తేజ్ ఆరోగ్య విషయం గురించి మాట్లాడుతూ తన ఆరోగ్యం కుదుటపడుతుందని తనని కలిసి తనతో మాట్లాడాలని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలిపారు.