ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఎప్పుడూ విభిన్న కథనాలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.అయితే తాజాగా శ్రీకాంత్ యాక్షన్ మరియు త్రిల్లింగ్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించాడు.
ఈ చిత్రానికి నూతన దర్శకుడు వెంకటేష్ దర్శకత్వం వహించాడు.అలాగే ఈ చిత్రాన్ని మల్టీ కలర్ ఫ్రేమ్స్ ల్యాబ్ బ్యానర్ పై నిర్మించారు.
ఈ చిత్రానికి అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన టువంటి మరణ మృదంగం అనే చిత్రం టైటిల్ ని ఖరారు చేశారు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయి పలువురు సినీ ప్రముఖుల మధ్య చిత్రం ప్రారంభమయింది.
ఈ సందర్భంగా ప్రస్తుతం మరణ మృదంగం అనే చిత్రంలో నటిస్తున్నానని, అలాగే ఈ చిత్ర టైటిల్ విషయంపై కూడా స్పష్టత ఇచ్చారు.తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని అంతేగాక అన్నయ్య నటించినటువంటి ప్రతి చిత్రాన్ని చూశానని అందులో తనకు అప్పట్లో నటించిన మరణ మృదంగం అనే చిత్రం టైటిల్ బాగా నచ్చిందని దానికితోడు ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్ర కథాంశం కూడా ఈ టైటిల్ కి సంబంధించి ఉండటంతో మరణ మృదంగం అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలిపాడు.
ఈ చిత్రం త్రిల్లింగ్ యాక్షన్ ఓరియంటెడ్ లో ఉంటుందని ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నానని అన్నారు.
అయితే శ్రీకాంత్ ఇప్పటికే పలు మల్టీస్టారర్ చిత్రాల్లో కూడా నటించాడు.అంతేకాక తనకు కథాంశం నచ్చితే పాత్ర ఎలాంటిదైనా చేయడానికి వెనుకాడని పలు సందర్భాల్లో కూడా చెప్పిన సంగతి తెలిసిందే.అంతేగాక ఇప్పటికే యాక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు నిర్వహించినటువంటి సిరీస్ లో కూడా శ్రీకాంత్ నటించాడు.