కొంతకాలం విరామం అనంతరం హీరో శివాజీ మరోసారి తన మాటలకు పదును పెట్టాడు.తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసాడు.
చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు.చుక్కల భూముల పేరుతో కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పాలని కుట్ర చేస్తున్నారని అన్నారు.కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శివాజీ తెలిపారు.
చుక్కల భూములపై మంత్రులను అధికారులు లెక్కచేయడం లేదని వ్యాఖ్యానించారు.
చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడకు అవకాశంగా మారిందని ఆరోపించారు.గట్టిగా మాట్లాడితే భూములు లాక్కుంటామని కలెక్టర్ బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు.ఆ భూములు కలెక్టర్ సొత్తా అని ప్రశ్నించారు.
త్వరలోనే అన్ని ఆధారాలను సిఎం చంద్రబాబుకు అందజేస్తానని చెప్పారు.సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని శివాజీ స్పష్టం చేశారు.