ఒకప్పుడు అమ్మాయి బాగుంది, తాజ్ మహల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన టువంటి హీరో శివాజీ గురించి తెలియని వారుండరు.అప్పట్లో శివాజీ నటించినటువంటి కొన్ని మల్టీస్టారర్ చిత్రాలు బాగానే మెప్పించి చాయి.
అయితే ఆ తర్వాత రాజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వెళ్లి భారతీయ జనతా పార్టీలో చేరాడు.ఇందులో భాగంగా పలు సమస్యలు పై పోరాడుతున్నాడు.
అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం నాటకీయ పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు.ఇప్పుడున్న పరిస్థితులు కొనసాగితే ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
అంతేగాక ఇప్పటికే వైకాపా పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నారని, అంతేగాక పలు ప్రాంతాల్లో ఇప్పటికే వైకాపా పాలనపై తీవ్ర నిరసనలు కూడా వెలువడుతున్నాయని అన్నారు./br>
అంతేగాక పాలనలో చంద్రబాబు నాయుడు మంచి దిట్ట అని ప్రజలకు ఎటువంటి పథకాలను చట్టాలను తెస్తే తే బాగుంటుందో అతనికి బాగా తెలుసు అని ఈ విషయం ప్రజలు కూడా బాగానే తెలుసు అని అన్నారు.అంతేగాక రాజకీయ వ్యూహాలను రచించడంలో చంద్రబాబు నాయుడుని మించిన వారు లేరని అన్నారు.అయితే ప్రస్తుత కాలంలో ప్రజలు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారనేది కాదని ఆ ముఖ్యమంత్రి జనాలకు ఎటువంటి మంచి చేశారనేది ప్రస్తుతం ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటివరకు తన సర్వేలో ఎక్కువమంది చంద్రబాబు నాయుడు పాలన కోరుకుంటున్నట్లు కూడా తెలిపారు.
ఈ అంశాలను బట్టి చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అని తెలిపారు.