2011 సంవత్సరంలో విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ సినిమా ‘ కో ‘.ఇదే సినిమాను టాలీవుడ్ లో ‘ రంగం ‘ అనే పేరుతో కె.వి.ఆనంద్ దర్శకత్వం లో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన సంగతి తెలిసిన విషయమే.అయితే ఈ సినిమాలో మొదటగా కాలీవుడ్ హీరో గా పేరు పొందిన శింబు మొదటగా హీరోగా నటించారు.ఇందుకు సంబంధించి మొదటగా రంగం సినిమాలో చూపించే బాంబు దాడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను హీరో శింబూ తో పాటు హీరోయిన్ కార్తిక లపై ఫోటోషూట్స్ కూడా నిర్వహించారు.
ఇది ఇలా ఉండగా.మరికొన్ని రోజుల్లో పూర్తి సినిమా షూట్ సెట్స్ పైకి వెళ్తున్న నేపథ్యంలో అనుకోని కారణాలవల్ల హీరో శింబూ సినిమా నుండి బయటికి వెళ్లిపోయాడు.
ఈ సమయంలోనే దర్శకుడు ఆనంద్ శింబూ చేయాల్సిన హీరో పాత్రలో హీరో జీవా ని తీసుకువచ్చి ప్రధాన పాత్రలో నటింపచేశాడు.అయితే సినిమా రిలీజ్ అయ్యి పది సంవత్సరాలు గడిచిన తర్వాత తాజాగా ముందుగా అనుకున్న హీరో శింబూ, హీరోయిన్ కార్తీక లకు సంబంధించిన ఫోటో షూట్ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ సినిమా నుండి శింబూ తప్పుకోవడానికి అప్పట్లో చాలా కారణాలే తెరపైకి వచ్చాయి.
హీరో శింబు దర్శకుడితో ఓ విషయంలో వివాదాలు రావడం వల్లే ఆయన ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయారని అనుకున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.
హీరో శింబూ సరసన హీరోయిన్ కార్తీక సరైన జోడీ కాదని హీరో భావించడంతో, ఆమె స్థానంలో తమన్నా కథానాయకుడిగా ఉంచమని చిత్ర బృందానికి హీరో శింబు సూచించారట.
అయితే హీరోయిన్ తమన్నా కు భారీగా పారితోషికం ఇవ్వాలని తమ దగ్గర అంత భారీ బడ్జెట్ లేదని నిర్మాతలు తేల్చి చెప్పడం వల్ల చేసేదేం లేక హీరో సినిమా నుండి బయటకు వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి.ఈ కారణం వల్ల మొత్తానికి హీరో శింబూ సూపర్ హిట్ అయిన రంగం సినిమా నుండి తప్పుకున్నారు.దీంతో రంగం సినిమాలో హీరోగా నటించిన జీవా కి మంచి అవకాశం లభించింది.
ఆ తర్వాత జీవా అనేక సినిమాలలో హీరోగా తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.