బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం “టైగర్ 3” చిత్రంలో నటిస్తున్నారు.కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ పాత్రలో కనిపించగా, కత్రినా కైఫ్ జోయా హుమాయినిగా కనిపించనుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చిత్ర బృందం టర్కీ వెళ్లారు.
ఈ క్రమంలోనే అక్కడ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టర్కీ వెళ్ళిన సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లకు టర్కీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి టర్కిష్ వ్యాపారవేత్త, రాజకీయవేత్త మెహ్మెత్ నూరి ఎర్సోయ్ సల్మాన్ ఖాన్, కత్రినాకు ఆతిథ్యం ఇచ్చారు.
ఈ క్రమంలోనే వీరితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.అంతర్జాతీయ తారలు సినిమా ప్రాజెక్టులకు దేశం మద్దతు,ఆతిథ్యం ఇస్తుందని టర్కిష్ లో రాశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పోటీ పడటం కోసం ప్రతినాయకుడి పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు.సల్మాన్ తో పోటీ పడటం కోసం ఇమ్రాన్ భారీగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్నారు.
ఇక సల్మాన్ ఖాన్ కత్రినా జోడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు వీరిద్దరు రియల్ జోడి అయితే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు ఆశపడ్డారు.
అయితే వారి ఆశలు నెరవేరకపోయినప్పటికీ ఇలా రీల్ పై కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.