మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురయ్యారు.మితిమీరిన వేగంతో కేబుల్ బ్రిడ్జి పై స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తుండగా.
అదుపుతప్పి ఒక్కసారిగా పల్టీలు కొట్టడంతో సాయి ధరమ్ తేజ్.అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
కళ్ళు భాగానికి అదే రీతిలో తల భాగానికి బలమైన గాయం అవడంతో.స్పృహ తప్పి రోడ్డుపై పడి పోయారు.
వెంటనే స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకొని సాయిధరమ్ తేజ్ నీ దగ్గరలో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు.వేగంగా డ్రైవ్ చేస్తూ ఉండటం తో ఒక్కసారిగా స్కిడ్ అయినా బైక్ నుండి సాయిధరమ్ తేజ్ పడినట్లు స్థానికులు చెబుతున్నారు.దీంతో ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బైక్ ని స్వాధీనం చేసుకోవడం జరిగిందట.
ప్రస్తుతం మెడికవర్ ఆసుపత్రిలో ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న సాయి ధరమ్ తేజ్ కి వైద్యులు చికిత్స అందిస్తున్నరు.