ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి దర్శకుడు తేజ దర్శకత్వం వహిస్తున్నటువంటి “రాక్షస రాజ్యంలో రావణాసురుడు” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ చిత్రంలో హీరో రానా సరసన ముగ్గురు కథానాయకులు నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కథానాయకుల్లో ఇప్పటికే గతంలో నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రాణా సరసన నటించిన కాజల్ అగర్వాల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం మరో ఇద్దరు కథానాయకుల కోసం దర్శకుడు తేజఇప్పటికే పలు రకాల ఆడిషన్లు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.అయితే ఇది ఇలా ఉండగా సినీ పరిశ్రమలో డైరెక్టర్ తేజ కి సన్నిహితంగా ఉంటున్నటివంటి కొందరు అనుష్క శెట్టి ని రికమెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మరి అనుష్కని డైరెక్టర్ తేజ తీసుకుంటాడో లేదో చూడాలి.ఈ విషయం ఇలా ఉండగా రానా ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు.అంతేగాక ఇప్పటికే రానా నటిస్తున్నటువంటి విరాటపర్వం ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.ఈ పోస్టర్ కి మంచి స్పందన లభించింది.
అయితే రానా “అరణ్య” అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించి నటువంటి టీజర్ విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.ఈ చిత్రం దాదాపుగా తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రభు సోలమన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని వచ్చే నెల రెండో తారీఖు న విడుదల చేసేందుకు దర్శకుడు సోలమన్ సన్నాహాలు చేస్తున్నాడు.
.