ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో దివారియర్ అనే సినిమా చేశారు.ఈ సినిమా జూలై 14 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచారు.ఈ విధంగా దివారియర్ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఇక ఈ ట్రైలర్ వేడుక అనంతపురంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ వేడుకలో పాల్గొన్న చిత్ర బృందం పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు.ఇక ఈ వేడుకలో భాగంగా హీరో రామ్ డైరెక్టర్ లింగస్వామి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శీను చేతుల మీదుగా విడుదల చేశారు ఇక ఆయన చేతుల మీదుగా ట్రైలర్ విడుదల అయ్యిందంటే ఈ సినిమా హిట్ అయినట్లే అంటూ రామ్ వెల్లడించారు.రామ్ డైరెక్టర్ లింగస్వామి గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
డైరెక్టర్ లింగుస్వామి గురించి రామ్ మాట్లాడుతూ.లింగస్వామి ఎంతో మంచి మనసున్న వ్యక్తి.ఆయన దర్శకత్వంలో వచ్చే ప్రతి సన్నివేశం ఆయన ఎంతో ఫీలయ్యి చేస్తారని, ఇక తెలుగులో కమర్షియల్ సినిమాలలో కొన్ని సన్నివేశాలు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల నుంచి స్ఫూర్తిగా పొందినవి అంటూ ఈ సందర్భంగా రామ్ డైరెక్టర్ లింగు స్వామి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇకపోతే రామ్ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోయపాటి శ్రీను హాజరయ్యారు.