ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి, తమన్నా, రాజశేఖర్, జీవిత, మరి కొందరు సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి విదితమే.
యంగ్ హీరో రామ్ తల్లి, సోదరునికి సైతం కొన్ని రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది.తాజాగా రామ్ తల్లి, సోదరుడికి కరోనా సోకిందని వెల్లడించారు.
2020 సంవత్సరం ముగింపుకు కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో హీరో రామ్ ఈ సంవత్సరం తాను విభిన్నమైన అనుభూతులను పొందానని తెలిపారు.ఏడాది కాలంలో లైఫ్ ఏ విధంగా గడిచిందో చెబుతూ తీపి, చేదు జ్ఞాపకాలను రామ్ పంచుకున్నారు.
హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన తరువాత వరుస షూటింగ్ లతో బిజీగా ఉండేవాడినని అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించిందని చెప్పారు.
అయితే నెలల తరబడి ఇంట్లో కూర్చోవడం మాత్రం నచ్చలేదని చిరాకు తెప్పించిందని రామ్ తెలిపారు.తన తల్లి, సోదరుడికి కరోనా నిర్ధారణ కావడం తనను ఎంతో బాధ పెట్టిందని రామ్ వెల్లడించారు.ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం వల్ల వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సోదరుడిలో కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో భయపడ్డానని రామ్ తెలిపారు.
రామ్ కరోనా మహమ్మారి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కెరీర్ లో వరుస ఫ్లాపుల తరువాత గతేడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ హిట్ కొట్టారు.
రామ్ ప్రస్తుతం రెడ్, తడమ్ రీమేక్ లో నటిస్తున్నారు.కథలు, దర్శకుల ఎంపికలో జాగ్రత్త వహిస్తూ కెరీర్ ను హీరో రామ్ చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.