ఎనర్జిటిక్ స్టార్ గా టాలీవుడ్ లో అందరితో పిలిపించుకునే హీరో రామ్ పోతినేని.కెరియర్ ఆరంభం నుంచి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో నెట్టుకొచ్చిన రామ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ మూవీ చేసిన తర్వాత ఒక్కసారిగా తన స్టొరీ సెలక్షన్ కంప్లీట్ గా మార్చుకున్నాడు.
స్టైలిష్ లుక్ తో కనిపిస్తే కమర్షియల్ హీరోగా ఇమేజ్ పెంచుకోవడం కష్టం అవుతుందని భావించి క్యారెక్టరైజేషన్, లుక్స్ మార్చే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో ఇస్మార్ట్ శంకర్ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే మూవీ చేశాడు.
ఈ మూవీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.అయితే ఇప్పుడు తమిళ్ లో మాస్ డైరెక్టర్ గా మంచి పేరున్న లింగుస్వామితో రామ్ జతకట్టాడు.
ఇప్పటికే ఈ మూవీని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.పక్కా మాస్ మసాలా కథతోనే ఈ మూవీని లింగుస్వామి తెరకెక్కించబోతున్నాడు.ఇక ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా ఖరారు అయిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే మూవీలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మొదటి సారి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ కథని సిద్ధం చేసుకున్న లింగుస్వామి హీరో పాత్ర కోసం నిజజీవిత పోలీస్ పాత్రని స్పూర్తిగా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.లాక్ డౌన్ సడలింపు వచ్చి షూటింగ్ లకి పర్మిషన్ రాగానే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే పోలీస్ ఆఫీసర్ రోల్ కావడం వలెనే లింగుస్వామి కథకి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.మరి పోలీస్ గా ఈ ఎనర్జిటిక్ హీరో ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ ఇస్తాడో అనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాలి
.