టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు, చాలామంది యంగ్ హీరోలు ఇప్పటికే పలు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే.అయితే కొందరు హీరోలు మాత్రమే ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించి మెప్పించారు.
మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మూడు పాత్రల్లో నటించగా ఆ తరువాత జై లవకుశ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించారు.బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచిన ఈ సినిమా హీరోగా ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
యంగ్ హీరో రామ్ కూడా తరువాత సినిమాలో మూడు పాత్రల్లో నటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.రెడ్ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన రామ్ ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మూడు పాత్రల్లో నటించడానికి సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే రామ్ మూడు పాత్రల్లో నటించబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయగా రామ్ కూడా ఎన్టీఆర్ బాటలోనే నడుస్తారని తెలుస్తోంది.రామ్ త్రిపాత్రాభినయం చేస్తే మాత్రం ఆ సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.అయితే ఈ సినిమాను ఎవరు దర్శకత్వం వహిస్తారో తెలియాల్సి ఉంది.
మరోవైపు రామ్ శివ మాల వేసుకొని దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి ” ఓం నమః శివాయ స్మాల్ బ్రేక్.ఇ విల్ బీ బ్యాక్” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
రామ్ స్మాల్ బ్రేక్ అని మెసేజ్ పెట్టడంతో కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నారని తెలుస్తోంది.41 రోజుల పాటు రామ్ శివుని మాలను వేసుకుని దీక్షలో ఉండనున్నారని తెలుస్తోంది.మరోవైపు రామ్ తదుపరి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.