చలో, భీష్మ సినిమాలతో వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలని ఖాతాలో వేసుకొని కమర్షియల్ ఎంటర్టైనర్ దర్శకుడుగా అందరి దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల.ఈ రెండు సినిమాల ఎఫెక్ట్ తో ఏకంగా స్టార్ హీరోలు పిలిచి మరీ సినిమా చేయడానికి ఆసక్తి చూపించారంటే అతని టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రేక్షకులకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ని తనదైన శైలిలో ప్రెజెంట్ చేసే వెంకీ కుడుములతో రామ్ చరణ్, మహేష్ బాబులు సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు.అయితే వారితో ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదు.
ఈ లోపు వెంకీ మరో సినిమా ప్లాన్ చేసుకున్నాడు.అయితే ఈ సారి సొంత కథతో కాకుండా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథతో సినిమా చేస్తున్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తన హోమ్ బ్యానర్ హారికా హాసినిలో రామ్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాకి తాను దర్శకత్వం వహించకుండా వెంకీకి ఆ బాధ్యతని అప్పగించినట్లు తెలుస్తుంది.
రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమా చేశాడు.ఇందులో మొదటి సరి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ ఆకట్టుకుంది.రామ్ కెరియర్ లో మొదటిసారి రొటీన్ కమర్షియల్ పక్కన పెట్టి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు.
ఇక సినిమాలో గెడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు.సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత ఫిబ్రవరిలో తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు.వెంకీ కుడుముల దర్శకత్వంలో త్రివిక్రమ్ కథతో ఈ సినిమా ఉండబోతుంది.
మరి త్రివిక్రమ్ అఆతో నితిన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినట్లు రామ్ కి కూడా ఇస్తాడేమో చూడాలి.