ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం రెగ్యులర్ కథలతో కాకుండా కొత్తదనం, కమర్షియల్, మాస్ కథలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.కొత్తదనం ఉన్న కథలకి ప్రాధాన్యత ఇస్తున్నాడు.
తాజాగా రెడ్ మూవీతో కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ గురించి రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.రామ్ తో సినిమాలు చేయడానికి చాలా మంది రెడీగా ఉన్న రొటీన్ కథలనే చెప్పడంతో వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడుతో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
కోలీవుడ్ లో మాస్ చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న లింగుస్వామితో రామ్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.
గతంలో లింగుస్వామి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
ఈ సినిమా లాంచ్ అయ్యింది కూడా.అయితే కథ విషయంలో ఇద్దరికి సింక్ అవ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది.
అయితే మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి లింగుస్వామి హీరో రామ్ ని ఎంచుకున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే రామ్ కి కథ కూడా చెప్పడం జరిగిందని, అది అతనికి నచ్చడంతో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా కూడా రామ్ హోం బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ లోనే తెరకెక్కే అవకాశం ఉందని బోగట్టా.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
పక్కా మాస్ మసాల స్టొరీనే రామ్ తో లింగు స్వామి తీస్తున్నాడని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.