ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు హీరో రామ్.ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సినిమాలనే చేసిన రామ్ మొదటి సారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కంప్లీట్ గా లుక్ మార్చేసి డిఫరెంట్ కథాంశంతో ఇస్మార్ట్ శంకర్ లో నటించాడు.
ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో రామ్ వేసుకున్నాడు.దాని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే మూవీ చేశాడు.
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రామ్ మొదటి సారి డ్యూయల్ రోల్ లో నటించాడు.అయితే ఇది డిజాస్టర్ అయ్యింది.
ప్రస్తుతం తమిళ్ దర్శకుడు లింగుస్వామితో రామ్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాలో రామ్ మొదటిసారి పూర్తి స్థాయిలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
మాస్, యాక్షన్ థ్రిల్లర్ గా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో రామ్ కి జోడీగా కృతి శెట్టి నటిస్తుంది.
ఈ అమ్మడుకి ఇది మూడో సినిమా.ఇక ఈ సినిమా కోసం రామ్ కంప్లీట్ గా మేకోవర్ మార్చేసి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని సమాచారం.
కండలు తిరిగిన దేహంతో పెర్ఫెక్ట్ పోలీస్ అన్నట్లు అతని లుక్ ఉండబోతుందని వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కూడా షెడ్యూల్ కూడా లింగుస్వామి ఫిక్స్ చేశారని టాక్.
జులై మొదటి వారంలోనే సెట్స్ పైకి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.ఈ లోపు కంప్లీట్ గా లుక్ మార్చే పనిలో రామ్ ఉన్నాడని వినికిడి.