మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా సమ్మర్ చివర్లో ప్రారంభం అయ్యి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది.కాని కరోనా కారణంగా ఆ మూవీ వచ్చే ఏడాది అయినా ప్రారంభం అవుతుందో లేదో అన్నట్లుగా పరిస్థితి ఉంది.
అల వైంకుఠపురంలో వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత త్రివిక్రమ్ ఏడాది పాటు వెయిట్ చేయడం ఏమాత్రం సరి కాదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో ఆయన కూడా ఎన్టీఆర్ కోసం ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేస్తాం అనే ఉద్దేశ్యంతో మద్యలో ఒక సినిమాను చేయాలని భావిస్తున్నాడు.
ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. రామ్ తో త్రివిక్రమ్ మూవీ అంటూ వస్తున్న వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.కాని ఇప్పటి వరకు సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.దర్శకుడు త్రివిక్రమ్ వైపు నుండి కాని రామ్ వైపు నుండి కాని నిర్మాతల నుండి కాని ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఆ వార్తలు మెల్ల మెల్లగా కనుమరుగవుతున్నాయి.
ఇదే సమయంలో మీడియాలో రామ్ తదుపరి సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. రెడ్ ను విడుదలకు సిద్దం చేసిన రామ్ కొత్త దర్శకుడితో సినిమాను చేసేందుకు డేట్లు ఇచ్చాడు అంటున్నారు.ఆ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కాని అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఒక మంచి కథను తీసుకు వచ్చిన కొత్త దర్శకుడితో సినిమాను చేసేందుకు రామ్ ఒప్పుకున్నాడట.ఆ సినిమా ఒప్పుకున్నంత మాత్రాన త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్ అయినట్లు కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అంటున్నారు.
కనుక ఇంకా రామ్ మరియు త్రివిక్రమ్ల మూవీ గురించిన వార్తలు మీడియాలో కనుమరుగవ్వక ముందే వీరు క్లారిటీ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజా వార్తలు