తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన “మా అన్నయ్య” అనే చిత్రంలో హీరోగా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మొదట్లో పలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ తరహా చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ రానురాను హీరో రాజశేఖర్ కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.
దీంతో ఒకానొక సమయంలో హీరో రాజశేఖర్ పలు ఆర్థిక పరమైన కష్టాలను ఎదుర్కొన్నాడని ఈ క్రమంలో తన పెద్దల నుంచి సంక్రమించిన రెండు ఇళ్లను కూడా అమ్మేశాడని పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.అయితే ప్రస్తుతం పిఎస్వి గరుడవేగ, కల్కి తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటూ హీరో రాజశేఖర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి బాగానే రాణిస్తున్నాడు.
అంతేగాక తన తదుపరి చిత్రాల కథల విషయంలో కూడా కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.కాగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు కన్మణి దర్శకత్వం వహిస్తున్న “అర్జున” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతుండగా ఇటీవలే హీరో రాజశేఖర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు.
దీంతో చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ పనులను నిలిపి వేశారు.కాగా వైద్యుల సంరక్షణలో రాజశేఖర్ చికిత్స తీసుకొని ఇటీవలే కోలుకున్నాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తాజాగా హీరో రాజశేఖర్ నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ గాని రాజశేఖర్ గాని స్పందించలేదు.
దీంతో ఈ వార్తల్లో నిజమెంతుందనే విష్యం ఇంకా తెలియాల్సి ఉంది.