టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్.ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు.
అతి తక్కువ సమయంలో ఎన్నో సినిమాలలో నటించిన ఈయన అంత క్రేజ్ మాత్రం అందుకోలేకపోయాడు.ఉయ్యాల జంపాల సినిమాతో రాజ్ తరుణ్ కు మంచి సక్సెస్ వచ్చింది.
ఆ తర్వాత సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ సినిమాలో కూడా నటించగా ఈ సినిమాలలో కూడా తనకు మంచి గుర్తింపునిచ్చాయి.
ఇక ఈ సినిమాల తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన కూడా అంతగా విజయాన్ని అందుకోలేదు.
ఇక అప్పటినుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.ఇటీవల తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ పవర్ ప్లే లో నటించగా ఈ సినిమా కూడా తనకు మంచి సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.
దీంతో రాజ్ తరుణ్ ఎలాగైనా సక్సెస్ ను అందుకోవాలన్న ఉద్దేశంతో తెగ ప్రయత్నిస్తున్నాడు.లవ్ నేపథ్యంలో కాకుండా కొత్తరకం పాత్రలతో మెప్పించాలని ఆసక్తి చూపుతున్నాడు.
ఇదిలా ఉంటే తను నటించిన ఓ సినిమాలో ఓ సీన్ చూసి హీరో నాని చాలా రియాక్ట్ అయ్యాడట.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్ తరుణ్ గతంలో తన సినిమాలలో ఎదుర్కొన్న కొన్ని విషయాల గురించి పంచుకున్నాడు.ఇక తను మొదట నటించిన ఉయ్యాల జంపాల సినిమా గురించి తెలుపుతూ అందులో హీరోయిన్ అవికా గోర్ నుండి తను చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు.అయితే ఆ సినిమాలో ఓ సీన్ తను ఏం చేశాడో అర్థం కాక మళ్లీ రీషూట్ చేద్దామని డైరెక్టర్ తో పదేపదే అన్నాడట.
కానీ డైరెక్టర్ మాత్రం ఆ సీన్ బాగా ఉందని మళ్లీ చివర్లో చూద్దాంలే అని అనేసరికి రాజ్ తరుణ్ సినిమా అంతా అయిపోయాక ఆ సీన్ గురించి మళ్లీ అడిగాడట.
ఇక దానితో డైరెక్టర్ అసలు ఆ సీన్ లో ఏం పొరపాటు ఉందని చూశాక చేద్దాంలే అని.మొదట ఆ సీన్ ను హీరో నానికి చూపించాడట.ఇక నాని కూడా ఆ సీన్ చాలా బాగుందని, అదిరిపోయింది అని అనడంతో షాక్ అయ్యాడట.
నిజానికి ఆ సీన్ లో తాను ఏం చేశాడో కూడా అర్థం కాలేదట.
ఇక ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు.డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా చివరిదశలో ఉందని తెలుస్తుంది.అంతే కాకుండా మరో డైరెక్టర్ తో 60 శాతం సినిమా పూర్తి చేశాడట.
మరో నూతన దర్శకుడితో కూడా ఓ సినిమా చేస్తున్నాడట.ఇక విజయ్ కుమార్ కొండా తో ఓ హ్యాట్రిక్ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలు రాజ్ తరుణ్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తాయో చూడాలి.