ఇటీవల ఇండస్ట్రీ లో పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి.మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఫ్ తమిళ్ ఇండస్ట్రీ హీరో శింబు పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ‘ఉయ్యాల జంపాల’ ఫెమ్ రాజ్ తరుణ్ కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది.గత కొంత కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ ఇక పెళ్లి కోసం ఎదురుచూడను అని అంటున్నాడు.
తాజాగా ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు రాజ్ ఈ సందేశాన్ని తెలిపాడు.త్వరలో తన పెళ్లి జరగబోతుంది అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
అంతేకాకుండా లవ్ కమ్ ఆరేంజ్జ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు కూడా తెలిపాడు.
దీనితో జనాలు బుర్రలకు పదును పెట్టి ఆలోచిస్తున్నారు.
ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయా,లేక బయట అమ్మాయా అన్న క్లారిటీ ఇవ్వడంపోవడం తో జనాలు ఈ పని చేస్తున్నారు.ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో అన్న విషయం తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే మరి.మరోపక్క రాజ్ తన కెరీర్ పై కూడా దృష్టి పెట్టాడు.గత కొంతకాలం గా హిట్ అనేది కొట్టలేకపోవడం తో తాజాగా దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ‘ఇద్దరి లోకం ఒక్కటే’ అనే చిత్రం చేస్తున్నాడు.
అయితే ఇక ఈ చిత్రం అయినా రాజ్ కు మంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.