ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది.కె.
జి.ఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 చేస్తూ ప్రభాస్ తో సలార్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.ఈ సినిమా ఇదివరకు ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా త్వరలో సినిమా సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతుంది.కె.జి.ఎఫ్ నిర్మాతలే ప్రభాస్ సలార్ కూడా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది.ప్రభాస్ సలార్ సినిమా ఒకటి కాదు రెండు పార్ట్ లుగా వస్తుందని తెలుస్తుంది.
ప్రభాస్ సలార్ కూడా కె.జి.ఎఫ్ తరహాలో రెండు పార్టులుగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడట ప్రశాంత్ నీల్.సినిమా అవుట్ పుట్ బాగా వస్తుండటంతో సినిమాని 2 పార్టులుగా ప్లాన్ చేస్తున్నారట.ప్రభాస్ సలార్ పార్ట్ 1 ఈ ఏడాది చివర్లో పార్ట్ 2 వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా అనగానే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచింది.మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.