యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు.ఈ మూడు కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.
మూడు షూటింగ్ దశల్లో ఉండగా అందులో రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ అదుగో ఇదుగో అంటూ గత మూడు సంవత్సరాలుగా జరుపుతూనే ఉన్నారు.
ఇంకా నెల రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరపాల్సి ఉందంటూ టాక్ వచ్చింది.కాని వరుసగా ఇతర సినిమా లకు ప్రభాస్ కమిట్ అయిన కారణంగా రాధే శ్యామ్ ను త్వరగా ముగించేయాలని భావించారు.
అందుకే దాదాపుగా మూడు వారాలు ఉన్న చిత్రీకరణ ను 8 రోజులకు కుదించారనే టాక్ వినిపిస్తుంది.ప్రభాస్ కేవలం 8 వర్కింగ్ డేస్ వస్తే రాధే శ్యామ్ షూటింగ్ ముగుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో పాటు ప్రభాస్ ఖాతాలో మరో పాన్ ఇండియా మూవీగా ఇది నిలుస్తుందని అభిమానులు మేకర్స్ చెబుతున్నారు.
యూవీ క్రియేషన్స్ తో పాటు కృష్ణం రాజు కూతురు ఈ సినిమాను దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
రికార్డు స్థాయిలో ఈ సినిమా 500 కోట్ల బిజినెస్ చేస్తుందని అంతా నమ్ముతున్నారు.పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో ప్రభాస్ లుక్ ఇప్పటికే రివీల్ అయ్యింది.1980 నేపథ్యంలో ఒక స్టైలిష్ స్క్రిన్ ప్లేతో ఈ సినిమా సాగుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.దర్శకుడు రాధా కృష్ణ చెప్పబోతున్న కథ ఇప్పటి వరకు మరే సినిమాలో చూసి ఉండరు అంటున్నారు.
కీలకమైన పాత్రలో కృష్ణం రాజు నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా చూడాలి.షూటింగ్ ను కుదించడం వల్ల వచ్చే నెలలో ఈ సినిమ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఇక విడుదల తేదీ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.