పుష్ప ది రైజ్ సినిమా, ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకముందు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ కు మాత్రమే గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలతో పాన్ ఇండియా హీరోల జాబితాలో తారక్, చరణ్, బన్నీ చేరారు.
ఈ హీరోలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.అయితే తారక్, చరణ్, బన్నీ, ఇతర పాన్ ఇండియా హీరోలతో పోటీ గురించి ప్రభాస్ స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మనం మరిన్ని పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించాలని క్రాస్ ఇండియన్ సినిమాలపై కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందని ప్రభాస్ అన్నారు.పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ సాధించినంత మాత్రాన ఆయా స్టార్స్ తో తనకు పోటీ పెరిగిందని తాను భావించనని ప్రభాస్ కామెంట్లు చేశారు.
సౌత్ నార్త్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా అందరూ కలిసి సినిమాలు చేస్తే మాత్రమే ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని భావిస్తానని ప్రభాస్ తెలిపారు.
తాజాగా తాను ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని ఆర్ఆర్ఆర్ మూవీ నాకు ఎంతగానో నచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన మూడో భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచిందని ఆయన కామెంట్లు చేశారు.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది.
రాజమౌళి ప్రస్తుతం భారతీయ దర్శకుడు అని సౌత్ ఇండియా డైరెక్టర్ కాదని ఆయన వెల్లడించారు.కేజీఎఫ్2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని ప్రశాంత్ నీల్ లాంటి గొప్ప దర్శకునితో పని చేస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.