2020 సంవత్సరంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నారు మహేష్ బాబు.ప్రస్తుతం మహేష్ బాబు కీర్తి సురేష్ తో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా 2021లో జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.అయితే సర్కారు వారి పాట సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారని.5 నుంచి 10 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందని సమాచారం.
గత రెండు రోజుల నుంచి సర్కారు వారి పాటలో పవన్ కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.పవర్ స్టార్, సూపర్ స్టార్ ఒకే సినిమాలో నటిస్తే మాత్రం సర్కారు వారి పాట రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది.
బ్రూస్ లీలో చిరంజీవిలా సర్కారు వారి పాటలో పవన్ పాత్రను కూడా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.పవన్ పాత్ర కథను మలుపు తిప్పుతుందని సమాచారం.
అయితే పవన్ కళ్యాణ్ నిజంగా సర్కారు వారి పాటలో నటిస్తున్నాడో లేదో తెలియాల్సి ఉంది. బ్యాంక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా మహేష్ బాబు లుక్ ఈ సినిమాలో కొత్తగా ఉంటుందని సమాచారం.బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతున్న ఆర్థిక మోసగాళ్లకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.మహేష్ బాబు ఈ సినిమాలో బ్యాంక్ మేనేజర్ పాత్రలో నటిస్తున్నారు.
గీతాగోవిందం సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.2021 సంవత్సరం దసరా పండుగకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.వరుస విజయాలతో దూసుకెళుతున్న మహేష్ బాబు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.