టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకరు.ఈయన తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.
వరుస ప్రేమ కథ సినిమాల్లో నటించి హిట్ కొట్టిన ఈయన ఆ తర్వాత తర్వాత మాత్రం వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు.చాలా ఏళ్ల పాటు నితిన్ నటించిన సినిమాలు అన్ని కూడా వరుస ప్లాప్స్ అయ్యాయి.
దీంతో ఇప్పుడు మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.తాజాగా ఈయన నటించిన ”మాచర్ల నియోజక వర్గం” రిలీజ్ కు రెడీ అవుతుంది.డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా నుండి వచ్చిన అన్ని ప్రొమోషనల్ అప్డేట్ లు ప్రేక్షకులను ఆకట్టు కున్నాయి.
ఇక ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తుండగా.కృతి శెట్టి, క్యాథరిన్ త్రేస్సా హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే తెలుగమ్మాయి అంజలి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది.ఈ సాంగ్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.
ఇక మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రేష్ఠ మూవీస్ వారు నిర్మిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత నితిన్ సముద్రఖని దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ విషయాన్నీ స్వయంగా సముద్రఖని వెల్లడించారు.ఈ సినిమా కోసం సముద్రఖని రెండేళ్ల క్రితమే స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టారని కానీ ఇది అప్పటి నుండి సెట్స్ మీదకు వెళ్ళడానికి కుదరలేదని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నట్టు సముద్రఖని చెప్పాడు.ఇప్పటికే ఈయన తెలుగులో నాలో, శంభో శివ శంభో, జెండాపై కపిరాజు సినిమాలను తెరకెక్కించారు.ఇక ఇప్పుడు నితిన్ సినిమాతో పాటు.పవన్ కళ్యాణ్ తో వినోదయ సీతం రీమేక్ చేయబోతున్నాడు.