టాలీవుడ్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ కు అతీతంగా వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటున్న హీరోలలో నితిన్ ఒకరు.2020లో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ సినిమాతో హిట్ కొట్టిన నితిన్ హీరోగా నటించి ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన చెక్ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.రంగ్ దే మూవీతో మళ్లీ సక్సెస్ సాధిస్తానని నమ్మకంగా ఉన్న నితిన్ కు ఈ నెల 26వ తేదీన విడుదల కాబోతున్న ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాల్సి ఉంది.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కర్నూలులో జరిగింది.
ఆ సమయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు నితిన్ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.గతేడాది నితిన్ షాలిని అనే యువతిని పెళ్లి చేసుకున్నారు.
కరోనా, లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య నితిన్ వివాహ వేడుక జరిగింది.అయితే ఒక అభిమాని నితిన్ ను పెళ్లి తరువాత సన్నబడటానికి కారణమేంటని ప్రశ్నించగా ఇంట్లో పనులు చేయడంతో పాటు బట్టలు ఉతికానని.
అంట్లు కూడా తోమానని అందువల్లే తాను బక్కచిక్కానని నితిన్ అన్నారు.
కర్నూలుకు తాను రావడం ఇదే తొలిసారని.
కర్నూలు పేరు వినగానే తనకు కొండారెడ్డి బురుజు గుర్తుకు వస్తుందని తెలిపారు.కొండారెడ్డి బురుజు దగ్గర సినిమా తెరకెక్కిస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుందని తెలిపారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ల కోసం, ఇతర ఈవెంట్ల కోసం చాలా ప్రాంతాలకు వెళ్లానని.కానీ ఇతర ప్రాంతాలతో పోలిస్తే కర్నూలు ప్రజల ఎనర్జీ మరింత ఎక్కువగా ఉందని నితిన్ తెలిపారు.
రంగ్ దే సినిమా స్వచ్చమైన ప్రేమకథ అని.రాయలసీమ పేరు చెబితే ఫ్యాక్షన్ అని మాస్ అని అంటారని కానీ ఇక్కడ వాటి కంటే ప్రేమ ఎక్కువగా ఉందని నితిన్ పేర్కొన్నారు.ఆ కారణం వల్లే తొలి ఈవెంట్ ను ఇక్కడ నిర్వహిస్తున్నామని.అభిమనులు ప్రేమతో తనకు ఒక హిట్ ఇవ్వాలని నితిన్ కోరారు.