నితిన్ హీరో గా తెరకెక్కిన మాచర్ల నియోజక వర్గం సినిమా ను ఆగస్టు 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే.నితిన్ కి జోడీగా ఈ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.
ఈ సినిమా కి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.నితిన్ మాచర్ల నియోజక వర్గం ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న రోజే అంటే ఆగస్టు 12 వ తారీకున నిఖిల్ హీరో గా నటించిన కార్తికేయ 2 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.
రెండు సినిమాలు ఒకే రోజు వస్తే కచ్చితంగా వసూళ్ళ పరంగా క్ల్యాష్ తప్పదు అనే ఉద్దేశం తో లాస్ట్ మూమెంట్ లో కార్తికేయ 2 సినిమా ను ఒక్క రోజు ఆలస్యం చేస్తున్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
కార్తికేయ 2 సినిమా విడుదల వాయిదా ను గురించి నిఖిల్ మాట్లాడుతూ రెండు సినిమా లు ఒకే రోజు రావడం అనేది కాస్త ఇబ్బందే.
కానీ ప్రతి సారి మేమే తగ్గాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు అంటూ మాచర్ల నియోజక వర్గం సినిమా యూనిట్ సభ్యుల పై అసహనం వ్యక్తం చేశాడు.ఈ రెండు సినిమాల కు కూడా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యం లో ఒక దాన్ని మించి ఒకటి వసూళ్ల ను రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రెండు సినిమా లు ఒకే రోజు రాక పోవడం మంచిదే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే నిఖిల్ అన్నట్లుగా చిన్న సినిమా ని కాకుండా పెద్ద సినిమా లను ఒక రోజు ఆలస్యం గా విడుదల చేస్తే తప్పేం లేదు.కానీ మాచర్ల నియోజక వర్గం సినిమా ఏ మాత్రం ఆలస్యం చేసేది లేదంటూ తేల్చి చెప్పడం తో నిఖిల్ తన సినిమా ను వాయిదా వేసుకోవలసి వచ్చిందని వార్తలు వస్తున్నాయి.