జై సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా కెరీర్ లో అంత సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం హీరో ఫ్రెండ్, ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు నవదీప్.హీరోగా కంటే ఈ పాత్రల్లోనే నవదీప్ కు మంచి పేరు, గుర్తింపు దక్కుతోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన నవదీప్ తన జీవితంలో ముఖ్య విషయాలను, వివాదాలు, ఇతర విషయాల గురించి చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీలో తేజ గారు హీరో లేదా హీరోయిన్ ను కొడితే సినిమా హిట్టవుతుందని తనను కొట్టకపోవడం వల్లే జై సినిమా ఫ్లాపై ఉండవచ్చని చెప్పారు.
తన తల్లీతండ్రిది ప్రేమ వివాహమని అక్క పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తోందని తెలిపారు.కెరీర్ పై ప్రధానంగా దృష్టి పెడుతున్నానని పెళ్లి గురించి ఇప్పట్లో ఆలోచన లేదని అన్నారు.
బుల్లితెర, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉండటం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.రానా తనకు మంచి స్నేహితుడని రానా పెళ్లి వార్త గురించి తెలిసి అవాక్కయ్యానని తెలిపారు.
బన్నీ, చరణ్ కూడా తనకు మంచి స్నేహితులమని చెప్పారు.
కొన్ని కథలు నచ్చకపోయినా బాగోలేదని చెప్పే ధైర్యం లేకపోవడం వల్ల చేశానని తెలిపారు.
ప్రస్తుతం ఒక పాత్ర కోసం గడ్డం పెంచుతున్నానని అన్నారు.గతంలో నవదీప్ కు హీరోయిన్ అంకితతో గొడవ జరిగినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
ఆ గొడవ గురించి స్పందించి అంకిత, తాను మనసు మాట వినదు అనే సినిమాలో నటించామని చెప్పారు.మనసు మాట వినదు సినిమా తెరకెక్కే సమయంలో తాను ఒక ఫ్లాప్ లో అంకిత వరుస హిట్లలో ఉందని వెల్లడించారు.
ఆ సమయంలో డేట్ల విషయంలో నిర్మాతకు, అంకితకు మధ్య గొడవ జరిగిందని అన్నారు.
ఆ సినిమా షూటింగ్ సమయంలో తాను జోకులు వేస్తున్నట్టు అంకిత నిర్మాతకు ఫిర్యాదు చేసిందని.
అయితే ఆ తరువాత తామిద్దరం కలిసి మాట్లాడుకున్నామని అన్నారు.అయితే అప్పటికే గొడవ పడినట్టు వార్తలు వైరల్ కావడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టతనిచ్చామని తెలిపారు.