ఈ మధ్య కాలంలో ప్రతి పండుగకు టీవీ ఛానెళ్లు ఈవెంట్లను ప్రసారం చేస్తూ ఈవెంట్ల ద్వారా మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్నాయి.మొదట్లో ఈటీవీ ఛానెల్ పండుగల సమయంలో ఈవెంట్లను టెలీకాస్ట్ చేయగా స్టార్ మా, జీ తెలుగు ఛానెళ్లు కూడా ప్రస్తుతం ఈవెంట్లను ప్రసారం చేస్తుండటం గమనార్హం.
ఈటీవీ ఉగాది జాతిరత్నాలు పేరుతో ఉగాది పండుగకు ఈవెంట్ ను ప్రసారం చేస్తుండగా నాని, రీతూవర్మ ఈ ఈవెంట్ కు గెస్ట్ లుగా హాజరయ్యారు.
ఈ నెల 23వ తేదీన టక్ జగదీష్ మూవీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
టక్ జగదీష్ ప్రమోషన్స్ లో భాగంగా నాని, రీతూవర్మ ఉగాది జాతిరత్నాలు షోకు వచ్చారు.సుధీర్ షోకు గెస్ట్ గా వచ్చిన పోసాని కృష్ణమురళితో మీరు మెంటల్ కృష్ణ సినిమాలో నైటీలో అదిరిపోయారు అని చెబుతాడు.
పోసాని తాను 400 సినిమాల్లో నటించానని నీకు ఆ నైటీనే కనబడిందా.? అంటూ ప్రశ్నిస్తాడు.సుధీర్ వెంటనే మనకు నైటీ ఉంటే చాలు సార్ అంటూ పంచ్ వేస్తాడు.
ఆ తరువాత శ్రీముఖి స్టేజ్ పైకి యాంకర్ పిలిస్తేనే హీరోలు కానీ, డైరెక్టర్ ను కానీ, ప్రొడ్యూసర్ ను కానీ పిలుస్తుందని అంటారు.
శ్రీముఖి అలా చెప్పడంతో ఆది యాంకర్స్ పిలిస్తే మేం వచ్చాం మేం పిలిస్తే యాంకర్స్ వచ్చారా.? అంటూ విచిత్రమైన పంచ్ వేశారు.ఆ తరువాత సుధీర్ టక్ జగదీష్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని వేప పువ్వు తింటాడు.ఆ తరువాత ఆది సుధీర్ కు శ్యామ్ సింగరాయ్ షూటింగ్ బాగా జరగాలని, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా జరగాలని ఇది అంటూ వేప పువ్వు ఇస్తాడు.
సుధీర్ వేప పువ్వు తింటే సినిమా హిట్ అవుతుందని చెప్పడంతో అది నాకు సెంటిమెంట్ అయిందని నాని చెప్పుకొచ్చారు.నాని అలా చెప్పడంతో సుధీర్ బలవంతంగా వేప పువ్వును తిన్నారు.ఉగాది పండుగ రోజున ఉదయం 9 గంటలకు ఈ ఈవెంట్ ప్రసారం కానుంది.