నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్యామ్ సింగ రాయ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కరోనా సమయంలోనే సినిమా పట్టాలెక్కి విడుదల అయ్యింది.
సినిమా అదుగో ఇదుగో అని ఊరించకుండా సింపుల్ గా విడుదల చేసి హడావుడి లేకుండానే మంచి విజయాన్ని నాని శ్యామ్ సింగ రాయ్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.నాని తాజాగా మరో సూపర్ హిట్ ను దక్కించుకునేందుకు సిద్దం అయ్యాడు.
అంటే సుందరానికి అనే సినిమా తో నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా గురించి నిన్న మొన్నటి వరకు అదుగో షురూ.
ఇదిగో షూటింగ్ ప్రారంభం కాబోతుంది అనే వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు.
అనూహ్యంగా షూటింగ్ ను ముగించినట్లుగా ప్రకటించడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళి ముద్దుగుమ్మ నజ్రియా నటించింది.తెలుగు లో మంచి గుర్తింపు ఉన్న ఈ అమ్మడు ఈ సినిమా లో నానికి జోడీగా నటించడం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు.ప్రతి సినిమా లో మాదిరిగానే ఈ సినిమా లో కూడా నాని చాలా నాచురల్ గా కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ పూర్తి చేయడంతో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.సమ్మర్ లో ఈ సినిమా ను విడుదల చేస్తామని అంటున్నారు.సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాలు సమ్మర్ కు వాయిదా పడ్డాయి.కనుక ఒక మంచి సమయం ను చూసి అంటే సుందరానికి సినిమా ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న దసరా సినిమా చిత్రీకరణ కూడా ఇదే ఏడాదిలో పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంకు విడుదల చేస్తారేమో చూడాలి.నాని జోరు చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.