ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని మంచు విష్ణుకు మోసగాళ్లు రూపంలో మరో షాక్ తగిలిన సంగతి తెలిసిందే.50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో 2 కోట్ల రూపాయల కలెక్షన్ కూడా సాధిస్తుందా అనే ప్రశ్నకు కష్టమే అనే సమాధానం వినిపిస్తోంది.అయితే మంచు విష్ణు మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై అంచనాలు పెంచడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు తనకు రియల్ లైఫ్ లో ఎదురైన మోసాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డైరెక్టర్లను గుడ్డిగా నమ్మడం వల్లే తాను చాలా సందర్భాల్లో మోసపోయానని విష్ణు తెలిపారు.లైఫ్ లో ఇకపై అలాంటి తప్పులు రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని విష్ణు పేర్కొన్నారు.
డబ్బు ఎక్కువగా ఉంటే టెన్షన్ కూడా ఎక్కువగానే ఉంటుందని విష్ణు తెలిపారు.
చాలామంది డబ్బు సంపాదనలో పడి లైఫ్ ను మిస్ అవుతున్నారని.కూతుళ్లు పుట్టిన తరువాతే తనకు అసలైన సంతోషం విలువ తెలిసిందని విష్ణు అన్నారు.చిన్నచిన్న సంతోషాలకు కూడా నవ్వగలిగేలా మనిషి ఉండాలని విష్ణు పేర్కొన్నారు.
సినిమా రంగంలో స్టార్ హీరో ప్రభాస్, నందమూరి కళ్యాణ్ రామ్ తో తాను సన్నిహితంగా ఉంటానని విష్ణు పేర్కొన్నారు.చాలామంది హీరోలు తనతో స్నేహపూర్వకంగా ఉంటారని విష్ణు తెలిపారు.
మోసగాళ్లు సినిమా అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ హక్కులు 30 కోట్ల రూపాయలకు అమ్ముడవగా 21 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే విష్ణు సేఫ్ అయ్యే అవకాశం ఉంది.కానీ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో విష్ణుకు భారీ మొత్తంలో నష్టాలు తప్పేలా లేవు.
మంచు విష్ణు తరువాత ప్రాజెక్ట్ ల విషయంలోనైనా జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది.