ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు బాగా దగ్గర సంబంధం ఉంటుందని అందరికీ తెలిసిందే.ఇప్పుడే కాదు ఎప్పటి నుండో సినీ రంగానికి చెందిన నటులు రాజకీయాల్లో చేరడం సొంతంగా పార్టీలు పెట్టుకోవడం చూసాం.
స్టార్ హీరోల కుటుంబాలు కూడా కొందరు రాజకీయ నాయకులకు మద్దతు పలుకుతుంటారు.ఇదిలా ఉంటే తాజాగా మంచు మనోజ్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ను కలిసి ఆయన పరిపాలన గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.
మంచు మోహన్ బాబు కూడా రాజకీయ నాయకులకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు.మంచు కుటుంబం గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ను ఈ కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు కలుస్తుంటారు.ఇదిలా ఉంటే తాజాగా మంచు మనోజ్ జగన్మోహన్ రెడ్డిని కలవగా ఈ విషయం గురించి తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
జగన్ మోహన్ రెడ్డి తో దిగిన ఒక ఫోటోను పంచుకుంటూ అందులో జగన్ పాలన గురించి ప్రశంసలు కురిపించాడు.సీఎం జగన్ ను కలిసే అవకాశం తనకు దక్కడంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు.భవిష్యత్తు కోసం జగన్ చేస్తున్న ప్రణాళికలు, ముందు జాగ్రత్తలు భేష్ అంటూ.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మీకున్న పోరాటంలో ఆకర్షితులయ్యాను అని తెలిపాడు.రాష్ట్రం కోసం మంచి చేస్తున్నా మీలాంటి నాయకులకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని.మీరు పరిపాలించే పాలనకు నేను అందించి శుభాకాంక్షలు అంటూ తెలుపగా ప్రస్తుతం మనోజ్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
అంతేకాకుండా జగన్ పట్ల చూపించిన అభిమానానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మాటలకు తెగ లైకులు కొడుతున్నారు.