ఆర్ ఎక్స్ 100 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు కార్తికేయ.ఈ సినిమా కంటే ముందుగా ప్రేమతో మీ కార్తిక్ అనే లవ్ స్టోరీ చేసిన అది పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.
అయితే ఆర్ఎక్స్ లో కార్తికేయ భగ్న ప్రేమికుడుగా చేసిన బోల్డ్, మాస్ పాత్ర ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది.ప్రతి ఒక్క యువకుడు ఆ పాత్రలో తమని తాము చూసుకున్నారు.
దీంతో ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు రికార్డు స్థాయి కలెక్షన్ సొంతం చేసుకుంది.అలాగే కార్తికేయకి కూడా అవకాశాలు పెరిఘాయి.
తరువాత ఈ యువ హీరో గుణ369, 90ఎంఎల్ అనే సినిమాలు చేశాడు.అవి పర్వాలేదనిపించుకున్నాయి.
కేవలం హీరో పాత్రలకె కార్తికేయ పరిమితం కాకుండా విలన్ రోల్స్ కి కూడా సై అనడంతో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది.ఆ సినిమా ఫ్లాప్ అయినా కార్తికేయ విలనిజం అందరికి రీచ్ అయ్యింది.
దీంతో ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో మెయిన్ విలన్ గా నటించే అవకాశం సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
దీంతో పాటు గీతా ఆర్ట్స్ లో చావు కబురు చల్లగా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమా సెట్స్ పైన ఉంది.
త్వరలో దీనికి సంబందించిన షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే కార్తికేయ హీరోగా మరో కొత్త సినిమా ఎనౌన్స్ చేశారు.
నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.ఈ సినిమాలో తాన్యా రవిచంద్రన్ కథానాయికగా నటించనున్నారు.
శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్గా కనిపిస్తారు.కీలక పాత్రలలో యువ నటుడు సుధాకర్ కొమాకుల కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.సాయి కుమార్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.మరి పోలీస్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా కార్తికేయకి ఎంత వరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.