ప్రేమతో మీ కార్తీక్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై ఆర్.ఎక్స్ 100 సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు కార్తికేయ.
ఆ సినిమా తరువాత నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్రలో నటించి కార్తికేయ మెప్పించారు.ఇటీవల విడుదలైన చావుకబురు చల్లగా సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించిన కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో బాగానే నటించినా సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
చావుకబురు చల్లగా ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరైన కార్తికేయ ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను బయట ఒకసారి పూరీ జగన్నాథ్ ను కలిశానని ఆ సమయంలో పూరీ జగన్నాథ్ ఆఫీస్ కు రమ్మని చెప్పారని ఆ తరువాత ఆఫీస్ కు వెళితే బయట వాచ్ మేన్ లాగేశాడని కార్తికేయ తెలిపారు.
ఆ తరువాత జ్యోతిలక్ష్మీ షూటింగ్ లో కలుద్దామని షూటింగ్ కు వెళ్లానని ఆ సమయంలో పూరీ జగన్నాథ్ ను కలవడానికి ప్రయత్నిస్తే బౌన్సర్లు లాగేశారని కార్తికేయ అన్నారు.
తరువాత పూరీ జగన్నాథ్ పిలిపించి అసిస్టెంట్ డైరెక్టర్ కు ఫోన్ నంబర్ ఇచ్చేసి వెళ్లమని చెప్పారని అలా జరిగిందని.తాను హీరో కాకముందు ఈ విధంగా జరిగిందని కార్తికేయ చెప్పుకొచ్చారు.హీరో అయిన తర్వాత పూరీ జగన్నాథ్ ను కలిశానని ఫోన్ లో పూరీ జగన్నాథ్ తో అప్పుడప్పుడూ మాట్లాడుతున్నానని తెలిపారు.
తాను ల్యాప్ టాప్, ఫోన్లను మరిచిపోతూ ఉంటానని కార్తికేయ చెప్పారు.
చిన్నప్పుడు అమ్మ మార్కులు తక్కువొస్తే నిర్ధాక్షిణ్యంగా కొట్టేవారని కార్తికేయ తెలిపారు.
తనకు ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి అజయ్ భూపతి కారణమని అలీతో సరదాగా షో సందర్భంగా కార్తికేయ చెప్పుకొచ్చారు.