టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు షాకింగ్ ట్విస్టుల వల్ల బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అలా షాకింగ్ ట్విస్టుల వల్ల హిట్ గా నిలిచిన సినిమాలలో ఆర్.
ఎక్స్ 100 ఒకటి.హీరోయిన్ పాత్ర ఊహించని విధంగా ఉండటం వల్ల ఆ సినిమా సక్సెస్ సాధించింది.
ఈ సినిమా విడుదలైన మూడేళ్ల తర్వాత అజయ్ భూపతి డైరెక్షన్ లో మహాసముద్రం సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో కార్తికేయ గెస్ట్ గా హాజరయ్యారు.
కార్తికేయ మాట్లాడుతూ మహాసముద్రం సినిమాకు రెండు ట్రైలర్లను రిలీజ్ చేసినట్టే ఆర్.ఎక్స్ 100 సినిమాకు కూడా రెండు ట్రైలర్లను విడుదల చేశామని తెలిపారు.మహాసముద్రం ట్రైలర్ ను చూసి ఆ హ్యాంగోవర్ లోనే ఉండిపోయానని కార్తికేయ అన్నారు.మహాసముద్రం సినిమాలో తనను పెట్టలేదని అలుగుతున్నానని కార్తికేయ చెప్పుకొచ్చారు.ఎవరు పిలిచినా పిలవకపోయినా అజయ్ భూపతి సినిమాల ఈవెంట్లకు తాను హాజరవుతానని కార్తికేయ వెల్లడించారు.
అజయ్ భూపతి గురించి ఫాదర్ ఆఫ్ రీబర్త్ అని చెబుతానని తాను ప్రస్తుతం జీవిస్తున్న జీవితానికి క్రెడిట్స్ అన్నీ అజయ్ కే దక్కుతాయని కార్తికేయ పేర్కొన్నారు.
ఆర్.ఎక్స్ 100 షూటింగ్ సమయంలోనే తాను మహాసముద్రం కథ విన్నానని ఆర్.ఎక్స్ 100 సినిమా రిలీజ్ సమయంలో సినిమా హిట్ కాకపోతే గేదెలు కాసుకుంటానని అన్నాడని ఇప్పుడు కూడా అజయ్ అలానే చెబుతున్నాడని కార్తికేయ అన్నారు.
అజయ్ భూపతితో తిట్టించుకోవడం చాలా ఇష్టమని కార్తికేయ పేర్కొన్నారు.ఆర్.ఎక్స్ 100 కంటే మహాసముద్రం కోసమే అజయ్ భూపతి కష్టపడ్డాడని కార్తికేయ తెలిపారు.మహా సముద్రం సినిమాపై బాగానే అంచనలు నెలకొనగా కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని శర్వానంద్ మహాసముద్రం సినిమాతో సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు.