టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల లిస్టులో గోపీచంద్ కూడా ఉన్నారు.తొలివలపు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్.
ప్రస్తుతం ఈయన సీటిమార్ అనే సినిమా చేస్తున్నాడు.వరుస ప్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ కు ఈ సినిమా కీలకంగా మారింది.
సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ సినిమా రూపొందుతుంది.కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ లేడీస్ టీమ్ కోచ్ గా పనిచేస్తున్నాడు.ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఎమోషన్ తో పాటు థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.
అయితే గోపీచంద్ ప్రస్తుతం చేస్తున్న సిటిమార్ సినిమాలో తమన్నా కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలా రెడ్డిగా నటిస్తుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది.ఈ సినిమాను ఏప్రిల్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో తామన్నాతో పాటు హిప్పీ ఫేమ్ దిగంగన సూర్య వంశి నటిస్తుంది.ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటిస్తుంది.
అయితే గోపీచంద్ సిటిమార్ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా టైటిల్ ను “పక్కా కమర్షియల్” అని అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ రోజు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.పూజా కార్యక్రమాలతో ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, సత్య రాజ్, దర్శకుడు మారుతీ, హీరో గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
గీత ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అక్టోబర్ 1 న సినిమా విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ అనుకుంటున్నారు.