యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం తిరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ జైపూర్ లో జరుగుతుంది.
యాక్షన్ నేపధ్యంగా తెరకేక్కే ఈ సినిమా లో తాజాగా కీలకమైన యాక్షన్ ఘట్టాలని దర్శకుడు తిరు తెరకేక్కిస్తున్నాడు.ఇదిలా వుంటే ఈ షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న సమయంలో హీరో గోపిచంద్ కి గాయాలు అయినట్లు తెలుస్తుంది.
ఓ బైక్ స్టంట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బైక్ స్కిడ్ కావడంతో క్రింద పడిన గోపిచంద్ కి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.దీంతో షూటింగ్ ని క్యాన్సిల్ ని వెంటనే గోపిచంద్ ని సమీపంలో వున్నా పోర్టీస్ హాస్పిటల్ చికిత్స అందిస్తున్నారు.
అయితే గాయాలు తీవ్రత ప్రమాదకరంగా లేవని షూటింగ్ చేసుకోవచ్చని డాక్టర్స్ చెప్పడంతో మరల షూటింగ్ మొదలెట్టే ప్రయత్నం లో దర్శకుడు తిరు వున్నట్లు తెలుస్తుంది.
చివరిగా గోపిచంద్ నటించిన పంతం సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.
దీంతో నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ ఇచ్చి తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ ఇచ్చాడు.ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.
గోపిచంద్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతూ వుండగా ప్రస్తుతం నార్త్ ఇండియాలో జైపూర్ లో షూటింగ్ ని రీసెంట్ గా స్టార్ట్ చేసారు.ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది.
ఇలాంటి టైం లో ఉన్నపళంగా గోపిచంద్ ప్రమాదానికి గురి కావడం గమనార్హం.