కోలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు ధనుష్.కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా, గాయకుడుగా, రచయితగా కూడా తనలోని భిన్న పార్శ్వాలని ఆవిష్కరించి మల్టీ టాలెంటెడ్ గా ధనుష్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
సౌత్ ఇండియా నుంచి రజినీకాంత్ తర్వాత హాలీవుడ్ మూవీలలో నటిస్తున్న నటుడుగా ధనుష్ తన ఇమేజ్ ని పెంచుకున్నాడు.ప్రస్తుతం అతని రెండో హాలీవుడ్ మూవీ రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే ధనుష్ చాలా కాలం నుంచి స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలని భావిస్తున్నాడు.లేదంటే లేదంటే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని మల్టీ స్టారర్ మూవీ అయినా చేయాలని భావిస్తున్నాడు.
ఈ నేపధ్యంలో గతంలో కింగ్ నాగార్జున, ధనుష్ కాంబినేషన్ లో ఒక సినిమా అనుకున్నారు.ధనుష్ దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కల్సి ఉన్న ఏవో కారణాల వలన క్యాన్సిల్ అయ్యింది.
అయితే ఇప్పుడు ప్రముఖ బ్యానర్ లో సౌత్ లాంగ్వేజస్ మూవీ ఒకటి ప్లాన్ చేస్తున్నారు.దీనికోసం ధనుష్ ఒక హీరోగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
ఇక మరో హీరోగా టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ఒకరు నటిస్తారని టాక్ వినిపిస్తుంది.లాక్ డౌన్ అనంతరం ఈ మూవీపై పూర్తిస్థాయి స్పష్టత రావడంతో అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.
ఇక ఈ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనే టాక్ వినిపిస్తుంది.ఈ మధ్య కాలంలో మైత్రీ నిర్మాతలు వరుసగా భారీ ప్రాజెక్ట్స్, క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు సెట్ చేస్తున్న నేపధ్యంలో ధనుష్ తెలుగు ఎంట్రీ మూవీ కూడా ఖరారు చేసినట్లు బోగట్టా.