పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో నటించిన పంజా సినిమా లో విలన్ క్యారెక్టర్ చేసిన అడవి శేష్ అప్పట్లోనే మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నడు.ఆ తర్వాత బాహుబలిసినిమాలో కూడా నటించిన అడవి శేష్ కి.
డిఫరెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమేకాక వెరైటీ సబ్జెక్టు ఎంచుకొని.సినిమాలు చేస్తాడనే ఇమేజ్ ఇండస్ట్రీలో క్రియేట్ అయింది.
హీరోగా క్షణం, గూడచారి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.
అటువంటి అడివి శేష్ తాజాగా డెంగ్యూ బారిన పడటంతో.
ఆయన బ్లడ్ ప్లేట్ లెట్స్ ఒక్కసారిగా ఇటీవల పడిపోయాయి.వారం రోజుల క్రితం డెంగ్యూ జ్వరం రాగానే ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకోగా ఒక్కసారిగా బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోవటంతో ఇప్పుడు తాజాగా ఆయన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అభిమానులతో పాటు కొంత మంది దాతలు అడివి శేష్ కి ప్లేట్ లెట్స్ అందించడానికి ముందుకు వస్తున్నారు.కుర్ర హీరో కావటంతో మంచి కెరీర్ ఉండటంతో అడవి శేష్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వార్తలు రావడంతో ఆయన అభిమానులు తాజా వార్త పై కంగారు పడుతున్నారు.